
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని భద్రాచలం ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబూరావు ఇద్దరు సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితా నుండి లంబాడి కులస్తులను తీసివేయాలని వేసిన పిటిషన్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ లంబాడీలను ఎస్టి జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తెల్ల వెంకటరావు, సోయం బాబురావును తక్షణమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని అన్నారు. లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆర్టికల్ 342 ప్రకారం యాక్ట్ 108 ద్వారా ఎస్టీ జాబితాలో పొందుపరచడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది లంబాడీలు ఉన్నారని అన్నారు. 1976 సంవత్సరంలో పార్లమెంటులో బిల్లు పాసై, రాష్ట్రపతి ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చారని, నిబంధనలకు అనుగుణంగానే ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చారని, కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆదివాసీలు ఆయా రాష్ట్రాల్లో ఆయా రిజర్వేషన్లలో, కొనసాగుతున్నారని, లంబాడీలు కూడా భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో ఎస్టి జాబితాలో, 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ సామాజిక ,సాంస్కృతిక పరంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా రిజర్వేషన్లను కొనసాగుతున్నారని, తెలంగాణలో లంబాడీలు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని అన్నారు. గిరిజనులంతా ఆదివాసీలు, లంబాడీలు కలిసిమెలిసి ఉంటున్నారని, ఈ యొక్క సోదరుల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది తప్పుడు వాదనలు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, ఆదివాసి ప్రజలారా మీరు ఈ యొక్క తప్పుడు విధానాలను అవలంబిస్తున్న రాజకీయ నాయకుల చెంతకు చేరవద్దని, మనమందరం ఉందామని, మన హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు.ధరావత్ మంగ్త భూక్య వెంకటేష్ నాయక్ భూక్య అశోక్ సురేష్ నాయక్. అంగోతు క్రాంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.